Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన
- పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- మహిళ పరిస్థితి విషయం
- జిల్లా ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
READ MORE: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
బాధితురాలి పేరు ఊర్మిళ సమాల్. సిలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆమె రోజువారీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు మహిళలు అక్కడికి చేరుకున్నారు. మహిళా ఉద్యోగిని తన బాధ్యతలను విస్మరించారని ఆరోపిస్తూ.. అంగన్వాడీ కేంద్రం వెలుపల చెట్టుకు కట్టేసి దుర్భాషలాడారు. ఈ సమయంలో ఉద్యోగి సహాయం కోసం అభ్యర్థించారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.
READ MORE:RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పిల్లల తల్లులు ఆహార సరఫరాలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆమె మా పిల్లలకు క్రమం తప్పకుండా గుడ్లు పెట్టడం లేదు. మేము దీని గురించి ఇంతకు ముందే ఫిర్యాదు చేశాం” అని దాడి సమయంలో ఒక మహిళ నివేదించారు. ఆరోపణలకు తోడు.. ఆ ఉద్యోగిని గతంలో ఓ చిన్నారిని గుర్తు తెలియని కారణాలతో అంగన్వాడీ కేంద్రంలోకి లాక్కెళ్లి కొట్టిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
READ MORE:Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ఘటనా స్థలానికి చేరుకున్న సీడీపీఓ..
స్థానిక అధికారులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి మరింత దిగజారింది. ఘటనపై సమాచారం అందుకున్న బలియాపాల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పర్బతి ముర్ము ఇతర అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోపంతో ఉన్న గ్రామస్థులను శాంతింపజేసి ఊర్మిళా సామల్ను రక్షించారు. ఆమె మొదట వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి దిగజారడంతో బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!