Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన
- పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- మహిళ పరిస్థితి విషయం
- జిల్లా ఆస్పత్రికి తరలింపు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
READ MORE: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
బాధితురాలి పేరు ఊర్మిళ సమాల్. సిలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆమె రోజువారీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు మహిళలు అక్కడికి చేరుకున్నారు. మహిళా ఉద్యోగిని తన బాధ్యతలను విస్మరించారని ఆరోపిస్తూ.. అంగన్వాడీ కేంద్రం వెలుపల చెట్టుకు కట్టేసి దుర్భాషలాడారు. ఈ సమయంలో ఉద్యోగి సహాయం కోసం అభ్యర్థించారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.
READ MORE:RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పిల్లల తల్లులు ఆహార సరఫరాలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆమె మా పిల్లలకు క్రమం తప్పకుండా గుడ్లు పెట్టడం లేదు. మేము దీని గురించి ఇంతకు ముందే ఫిర్యాదు చేశాం” అని దాడి సమయంలో ఒక మహిళ నివేదించారు. ఆరోపణలకు తోడు.. ఆ ఉద్యోగిని గతంలో ఓ చిన్నారిని గుర్తు తెలియని కారణాలతో అంగన్వాడీ కేంద్రంలోకి లాక్కెళ్లి కొట్టిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
READ MORE:Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ఘటనా స్థలానికి చేరుకున్న సీడీపీఓ..
స్థానిక అధికారులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి మరింత దిగజారింది. ఘటనపై సమాచారం అందుకున్న బలియాపాల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పర్బతి ముర్ము ఇతర అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోపంతో ఉన్న గ్రామస్థులను శాంతింపజేసి ఊర్మిళా సామల్ను రక్షించారు. ఆమె మొదట వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి దిగజారడంతో బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!