Daggubati Purandeswari: అందుకే పాకిస్తాన్కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది!
- పారిస్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి పురందేశ్వరి ప్రసంగం
- సరిహద్దు ఉగ్రవాదంతో భారత్ చాలా కాలం బాధపడింది
- భారత్ బాధ్యతాయుతమైన దేశంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు. పారిస్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యురాలు పురందేశ్వరి ప్రసంగించారు.
Also Read: Mahanadu 2025: కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం చంద్రబాబు!
Also Read
దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘భారతదేశం 1947 నుండి 2025 ఏప్రిల్ 22 వరకు సరిహద్దు ఉగ్రవాదంతో చాలా కాలం బాధపడింది. దేవుడు అనుమతించడు, ఇది కొనసాగాలని మేము కోరుకోవడం లేదు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదు. 2014కి ముందు ఉగ్రవాదులు వచ్చి భారత పౌరులపై దాడి చేశారు. భారత్ బాధ్యతాయుతమైన దేశంగా ఉంది. భారత్ ఎప్పుడూ యుద్ధం చేయలేదు, ఇది పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయింది. అందువల్లే భారత్ వారికి తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది. భారత్ అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. పొరుగుదేశం పాకిస్తాన్ మాత్రం భారత్ పౌరులను, మిలిటరీని టార్గెట్ చేసి దాడులు చేసింది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!