టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.
Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
ఈ గురువారం ఉదయం ఉదయ్పూర్లోని ఒక కోటలో విజయ్ – రష్మికల వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. విజయ్ మరియు రష్మికకు అత్యంత సన్నిహితులైన కొద్దిమంది స్నేహితులకు మాత్రమే ఈ రాయల్ వెడ్డింగ్కు హాజరుకానున్నారు. తక్కిన వారెవరికీ ఈ పెళ్ళికి ఎంట్రీ లేదు. ఉదయ్పూర్లో పెళ్లి ముగించుకుని వచ్చిన తర్వాత, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లో భారీ రిసెప్షన్ను ప్లాన్ చేశారు. మార్చి 4న హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్కు హాజరుకానున్నారు. . ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలకు ఆహ్వాన పత్రికలు అందించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ ‘రీల్’ జోడీ ఇప్పుడు ‘రియల్’ లైఫ్ పార్ట్నర్స్ కాబోతుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.