Thatikonda Rajaiah : కడియంతో నేను ఇంకా కలిసిపోలేదు.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్యే టికెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కడియంతో నేను ఇంకా కలిసిపోలేదని, కార్యకర్తలు అపోహ పడవద్దన్నారు. కేటీఆర్ నీ కలిశాను కేటీఆర్ తో మాట్లాడానని, కేటీఆర్ దగ్గర కొందరు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు ఉంటే అందరం కలిసి ఫోటో మాత్రమే దిగారన్నారు. కడియంకి నాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, కార్యకర్తలు ఎలాంటి అపోహ పడొద్దన్నారు తాటికొండ రాజయ్య. అధిష్టానం నిర్ణయాన్ని అందరం శిరసా వహించాల్సి ఉంటుందని, 2018లో ఎలా అయితే స్టేషన్ఘన్పూర్ కార్యకర్తలను కలిపే కార్యక్రమం జరిగిందో అలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కార్యకర్తలు ఆదోళనలు చెందొద్దని సీఎం కేపీఆర్ 115 టికెట్లు కేటాయించడం జరిగిందని, నివేదికలు, సర్వే రిపోర్ట్ లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు.
అంతేకాకుండా.. ‘కేటాయించిన స్థాలలో ఎక్కడ కూడా బి ఫామ్ లు ఇవ్వలేదు… కొన్ని నియోజకవర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయి… చాలాబాగా పనిచేస్తున్నవ్, టికెట్ నీకే అని హామీ కేటీఆర్ ఇవ్వడం జరిగింది… టికెట్లు ప్రకటించే సమయంలో కేటిఆర్ లేకపోవడంతో రెండు రోజుల క్రితం వెల్లి కలిశాను.. ఎమ్మెల్సీగాని, ఎంపి గానీ అవకాశం ఉంది, అప్పటివరకు స్టేట్ కార్పోరేషన్ నామినేషన్ పదవి తీసుకొని అని చెప్పడం జరిగింది.. అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కలిసి ఫోటోలు దిగడం జరిగింది.. ఆ ఫోటోకు ఊహా గానాలు చేయడంతో,మీడియాలో వచ్చిన కథనాలకు రకారకాలుగా కార్యకర్తల్లో ఆంధోళన నెలకొంది…
Also Read
గత పదిహేను రోజుల క్రితం వరంగల్ ల్లో మాదిగల ఇంటలెక్షర్స్ ఫోరంలో వరంగల్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెల్తున్నారని కథనాలు రాయడం జరిగింది.. గత 2014 లో ఎంపి అభ్యర్థిగా కడియం,ఎమ్మెల్యేగా నేను అధిస్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేయటం జరిగింది.. అధిస్టానానికి నిర్ణయానికి కట్టుబడి ఉందాం… జనవరి 17 వరకు ఎమ్మెల్యే గా ఉంటా,ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలల్లో పాల్గొనాలి… కార్యకర్తలు నిలకడగా ఉండండి. కేటీఆర్ తో నాకు సంభాషన జరిగింది,దాన్ని వక్రీకరించడాన్ని ప్రెస్ ముఖంగా ఖండిస్తున్న… బిఫాం తప్పకుండా నాకే వస్తది… ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుంది..’ అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!