Thatikonda Rajaiah : కడియంతో నేను ఇంకా కలిసిపోలేదు.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్యే టికెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కడియంతో నేను ఇంకా కలిసిపోలేదని, కార్యకర్తలు అపోహ పడవద్దన్నారు. కేటీఆర్ నీ కలిశాను కేటీఆర్ తో మాట్లాడానని, కేటీఆర్ దగ్గర కొందరు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు ఉంటే అందరం కలిసి ఫోటో మాత్రమే దిగారన్నారు. కడియంకి నాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, కార్యకర్తలు ఎలాంటి అపోహ పడొద్దన్నారు తాటికొండ రాజయ్య. అధిష్టానం నిర్ణయాన్ని అందరం శిరసా వహించాల్సి ఉంటుందని, 2018లో ఎలా అయితే స్టేషన్ఘన్పూర్ కార్యకర్తలను కలిపే కార్యక్రమం జరిగిందో అలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కార్యకర్తలు ఆదోళనలు చెందొద్దని సీఎం కేపీఆర్ 115 టికెట్లు కేటాయించడం జరిగిందని, నివేదికలు, సర్వే రిపోర్ట్ లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు.
అంతేకాకుండా.. ‘కేటాయించిన స్థాలలో ఎక్కడ కూడా బి ఫామ్ లు ఇవ్వలేదు… కొన్ని నియోజకవర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయి… చాలాబాగా పనిచేస్తున్నవ్, టికెట్ నీకే అని హామీ కేటీఆర్ ఇవ్వడం జరిగింది… టికెట్లు ప్రకటించే సమయంలో కేటిఆర్ లేకపోవడంతో రెండు రోజుల క్రితం వెల్లి కలిశాను.. ఎమ్మెల్సీగాని, ఎంపి గానీ అవకాశం ఉంది, అప్పటివరకు స్టేట్ కార్పోరేషన్ నామినేషన్ పదవి తీసుకొని అని చెప్పడం జరిగింది.. అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కలిసి ఫోటోలు దిగడం జరిగింది.. ఆ ఫోటోకు ఊహా గానాలు చేయడంతో,మీడియాలో వచ్చిన కథనాలకు రకారకాలుగా కార్యకర్తల్లో ఆంధోళన నెలకొంది…
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
గత పదిహేను రోజుల క్రితం వరంగల్ ల్లో మాదిగల ఇంటలెక్షర్స్ ఫోరంలో వరంగల్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెల్తున్నారని కథనాలు రాయడం జరిగింది.. గత 2014 లో ఎంపి అభ్యర్థిగా కడియం,ఎమ్మెల్యేగా నేను అధిస్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేయటం జరిగింది.. అధిస్టానానికి నిర్ణయానికి కట్టుబడి ఉందాం… జనవరి 17 వరకు ఎమ్మెల్యే గా ఉంటా,ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలల్లో పాల్గొనాలి… కార్యకర్తలు నిలకడగా ఉండండి. కేటీఆర్ తో నాకు సంభాషన జరిగింది,దాన్ని వక్రీకరించడాన్ని ప్రెస్ ముఖంగా ఖండిస్తున్న… బిఫాం తప్పకుండా నాకే వస్తది… ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుంది..’ అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!