Virat Kohli: అదే నాకు అసలైన గేమ్: కోహ్లీ
- మూడేళ్ల పాటు సెంచరీ చేయలేదు
- 2022 టీ20 ప్రపంచకప్లో శతకం
- క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అన్ని ఫార్మాట్లలో నిలకడ, దూకుడు శైలి, నాయకత్వ లక్షణాలు క్రికెట్పై చెరగని ముద్ర వేశాయి. ఆట పట్ల విరాట్కు ఉన్న అభిరుచి, అంకితభావం అతన్ని క్రికెట్లో అత్యంత ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్.. ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. ఆపై తిరిగి పుంజుకున్నాడు. అందుకే విజయాలను మాత్రమే కాకుండా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండటం చాలా ముఖ్యమని కోహ్లీ అంటున్నాడు.
విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘జీవితం లేదా కెరీర్ ఏదైనా సరే గొప్పగా లేనప్పుడు ఎలా స్పందిస్తారు?, వాటిని ఎదుర్కొని ఎలా ముందుకుసాగుతారు? అనే విషయాలు చాలా సున్నితమైనవి. ఫలితాలు మనకు అనుకూలంగా రానప్పుడు ఏ పనీ చేయలేం. ప్రాక్టీస్కు చేద్దామని కానీ.. జిమ్లో కసరత్తులు చేద్దామని కానీ ఆసక్తి ఉండదు. జీవితంలో కేవలం విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాదు క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండాలి. ఎప్పుడూ కఠినంగా శ్రమించాలి. సక్సెస్తో సంబంధం లేకుండా కష్టపడాలి. నావరకైతే అదే అసలైన గేమ్. ఇదంతా దేవుడి పరీక్షగా భావించాలి. ఉన్నత స్థాయిలో కష్టపడకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేం’ అని అన్నాడు.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
Also Read: Lakshya Sen: వచ్చేసారి పతకం సాధిస్తా.. ప్రధాని మోడీతో లక్ష్యసేన్!
2020, 2021, 2022లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దాదాపు మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినా.. సెంచరీ లేదని చాలా విమర్శలు వచ్చాయి. చివరిగా 2022 టీ20 ప్రపంచకప్లో శతకం చేశాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023 వన్డే ప్రపంచకప్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. ఇటీవల శ్రీలంకపై వన్డే సిరీస్ ఆడిన విరాట్.. ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం వచ్చే నెలలో స్వదేశానికి రానున్నాడు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?