TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
READ MORE: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Also Read
మరోవైపు.. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. సమ్మెకు సంబంధించి 32 అంశాల్లో 29 సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. “మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక కమిటీ వేశాం, చర్చలు జరుగుతుంటే మధ్యలోనే వెళ్లిపోయిన కొందరు నాయకులు చర్చలు విఫలం అంటున్నారు. కేసీఆర్ మొన్నటి సభలో మహాలక్ష్మి పథకం గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఎలాగైనా ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలి.. తక్కువ చేసి చూపించాలి అని కుట్ర చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం మేము పని చేయిస్తున్నాం. శ్రమ దోపిడి చేసే ఉద్దేశం మాకు లేదు. మేము సిబ్బందికి, కార్మికులకు పనిభారం తగ్గించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం. పాత విధానాలకు స్వస్తి పలికి పని గంటలు తగ్గించాం. కారుణ్య నియామకాలు చేపట్టాం. పేద ప్రజల లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీరం చేసే కుట్ర చేస్తే ఊరుకోం. మాకు కార్మికుల పట్ల నెగిటివ్ ఒపీనియన్ లేదు. నిధులకు సంబంధించి తాము ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలని అనుకుంటున్నారు. సామరస్యంగా డిపోలలో నిరసన తెలపండి. కానీ ఈవిధంగా సమ్మెలు చేస్తే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. మా మీద జాతి వైరం ఉందా మీకు.. మేము మీ కోసం ఇంత శ్రమిస్తుంటే.. గత ప్రభుత్వం. చేపట్టిన చర్యలు మీకు గుర్తు లేదా?” అని మంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!