TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
READ MORE: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
మరోవైపు.. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. సమ్మెకు సంబంధించి 32 అంశాల్లో 29 సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. “మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక కమిటీ వేశాం, చర్చలు జరుగుతుంటే మధ్యలోనే వెళ్లిపోయిన కొందరు నాయకులు చర్చలు విఫలం అంటున్నారు. కేసీఆర్ మొన్నటి సభలో మహాలక్ష్మి పథకం గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఎలాగైనా ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలి.. తక్కువ చేసి చూపించాలి అని కుట్ర చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం మేము పని చేయిస్తున్నాం. శ్రమ దోపిడి చేసే ఉద్దేశం మాకు లేదు. మేము సిబ్బందికి, కార్మికులకు పనిభారం తగ్గించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం. పాత విధానాలకు స్వస్తి పలికి పని గంటలు తగ్గించాం. కారుణ్య నియామకాలు చేపట్టాం. పేద ప్రజల లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీరం చేసే కుట్ర చేస్తే ఊరుకోం. మాకు కార్మికుల పట్ల నెగిటివ్ ఒపీనియన్ లేదు. నిధులకు సంబంధించి తాము ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలని అనుకుంటున్నారు. సామరస్యంగా డిపోలలో నిరసన తెలపండి. కానీ ఈవిధంగా సమ్మెలు చేస్తే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. మా మీద జాతి వైరం ఉందా మీకు.. మేము మీ కోసం ఇంత శ్రమిస్తుంటే.. గత ప్రభుత్వం. చేపట్టిన చర్యలు మీకు గుర్తు లేదా?” అని మంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!