TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.
READ MORE: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Also Read
మరోవైపు.. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. సమ్మెకు సంబంధించి 32 అంశాల్లో 29 సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. “మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక కమిటీ వేశాం, చర్చలు జరుగుతుంటే మధ్యలోనే వెళ్లిపోయిన కొందరు నాయకులు చర్చలు విఫలం అంటున్నారు. కేసీఆర్ మొన్నటి సభలో మహాలక్ష్మి పథకం గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ఎలాగైనా ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలి.. తక్కువ చేసి చూపించాలి అని కుట్ర చేస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం మేము పని చేయిస్తున్నాం. శ్రమ దోపిడి చేసే ఉద్దేశం మాకు లేదు. మేము సిబ్బందికి, కార్మికులకు పనిభారం తగ్గించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం. పాత విధానాలకు స్వస్తి పలికి పని గంటలు తగ్గించాం. కారుణ్య నియామకాలు చేపట్టాం. పేద ప్రజల లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీరం చేసే కుట్ర చేస్తే ఊరుకోం. మాకు కార్మికుల పట్ల నెగిటివ్ ఒపీనియన్ లేదు. నిధులకు సంబంధించి తాము ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తున్నాం. ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలని అనుకుంటున్నారు. సామరస్యంగా డిపోలలో నిరసన తెలపండి. కానీ ఈవిధంగా సమ్మెలు చేస్తే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. మా మీద జాతి వైరం ఉందా మీకు.. మేము మీ కోసం ఇంత శ్రమిస్తుంటే.. గత ప్రభుత్వం. చేపట్టిన చర్యలు మీకు గుర్తు లేదా?” అని మంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!