Deputy CM Bhatti Vikramarka: పదేళ్లో లెక్క.. ఇప్పుడో లెక్క.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా
- గత 10 సంవత్సరాలు అభివృద్ధి పనులు లేక ఇబ్బందులు పడ్డాం
- జములాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తా
- నాకు వేసిన ఓటు విలువ పెంచారు
- ఎర్రుపాలెం మండలానికి నీటి ఇబ్బందులు లేకుండా చేస్తా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. జములాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. “ఎనిద్రం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశాను. జములాపురం టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. గత 15 పాలకుల అలసత్వం వల్ల అభివృద్ధి జరగలేదు. జమలాపురం చెరువు అహ్లాదకరంగా ఉండేలా అనుమతులు మంజూరు చేశాం. త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తాను. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తా. ఎరుపాలెం మండలం మొత్తాన్ని సాగర్ మూడవ జోన్ నుంచి రెండవ జోన్ లోకి మార్చి మండలంలో ఎక్కడ సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతా. రెండో జోన్లో మార్చేందుకు అవసరమైన సర్వేలు, మ్యాపులు, ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. త్వరలోనే జీవో విడుదల అవుతుంది. ఇందుకుగాను బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాం.” అని స్పష్టం చేశారు.
READ MORE: Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ఎర్రుపాలెం మండలం మొత్తం రోడ్లు వేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రహదారులు నిర్మిస్తామని.. మండలం మొత్తం ఒక రింగ్ రోడ్డులా అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కట్టలేరు ఆధునికీకరనకు నిధులు మంజూరు చేశామన్నారు. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ఆర్థిక, విద్యుత్ , ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. మీరిచ్చిన అవకాశంతో ఆర్థిక మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయగలిగానని తెలిపారు. నాకు మీరు వేసిన ఓటు విలువను పెంచారన్నారు.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!