Deputy CM Bhatti Vikramarka: పదేళ్లో లెక్క.. ఇప్పుడో లెక్క.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా
- గత 10 సంవత్సరాలు అభివృద్ధి పనులు లేక ఇబ్బందులు పడ్డాం
- జములాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తా
- నాకు వేసిన ఓటు విలువ పెంచారు
- ఎర్రుపాలెం మండలానికి నీటి ఇబ్బందులు లేకుండా చేస్తా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. జములాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. “ఎనిద్రం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశాను. జములాపురం టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. గత 15 పాలకుల అలసత్వం వల్ల అభివృద్ధి జరగలేదు. జమలాపురం చెరువు అహ్లాదకరంగా ఉండేలా అనుమతులు మంజూరు చేశాం. త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తాను. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తా. ఎరుపాలెం మండలం మొత్తాన్ని సాగర్ మూడవ జోన్ నుంచి రెండవ జోన్ లోకి మార్చి మండలంలో ఎక్కడ సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతా. రెండో జోన్లో మార్చేందుకు అవసరమైన సర్వేలు, మ్యాపులు, ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. త్వరలోనే జీవో విడుదల అవుతుంది. ఇందుకుగాను బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాం.” అని స్పష్టం చేశారు.
READ MORE: Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఎర్రుపాలెం మండలం మొత్తం రోడ్లు వేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రహదారులు నిర్మిస్తామని.. మండలం మొత్తం ఒక రింగ్ రోడ్డులా అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కట్టలేరు ఆధునికీకరనకు నిధులు మంజూరు చేశామన్నారు. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ఆర్థిక, విద్యుత్ , ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. మీరిచ్చిన అవకాశంతో ఆర్థిక మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయగలిగానని తెలిపారు. నాకు మీరు వేసిన ఓటు విలువను పెంచారన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!