Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ
- అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం నా బాధ్యత
- ఇక మీద పరీక్ష వాయిదాలు ఉండవు
- Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తాం
- టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. వాయిదాలు ఉండవని.. అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండన్నారు. డీఎస్సీ ఫలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగినట్లు తెలిపారు. Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చినట్లు తెలిపారు. యూపీఎస్సీ తో సమానంగా tgpsc పని చేస్తుందని కొనియాడారు.
READ MORE: Delhi: ఉబర్కు కోర్టు షాక్.. టైమ్కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
తన మీద నమ్మకం తో పరీక్షలు రాయాలని.. ఎవరైనా పైరవీ చేస్తా నంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పబ్లిక్ కు అందుబాటులో ఒక ఫోన్ నంబర్ పెడతామని చెప్పారు.
Tgpsc ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తామని వివరించారు. తెలంగాణ గెలిచి నిలవాలన్నారు.. ఐఏఎస్ కావాలని తన కల సాకారం అయిందని.. రాజీనామా చేసి ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.
READ MORE: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
కాగా.. టీజీపీఎస్సీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 3తో మహేందర్రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!