Farooq Abdullah: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగా ఉంది.. అలా చేస్తేనే అంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్తో చర్చలు జరపడం ద్వారానే దాన్ని అంతం చేయగలమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం దేశ సమగ్రతకు ప్రమాదకరమని బీజేపీపై మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లకు వారి గాయాలపై ఔషధతైలం అవసరమని, ప్రేమ ద్వేషాన్ని భర్తీ చేస్తే సాధ్యమవుతుందని కూడా ఆయన అన్నారు.
‘ఉగ్రవాదం సజీవంగా ఉందని, పకిస్థాన్తో మాట్లాడేంత వరకు అది అంతం కాదని రక్తంతో రాతపూర్వకంగా తెలియజేస్తున్నానని అన్నారు. 16 సార్లు మన సరిహద్దుల్లోకి ప్రవేశించి ల్యాండ్ అయిన చైనాతో మాట్లాడగలిగిన మీరు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. పాకిస్థాన్తో చర్చలు జరపాలని మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్లా గురువారం విలేకరులతో అన్నారు. ఆయన బస్సులో జమ్మూ నుంచి కతువాకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం పంజాబ్లోని పఠాన్కోట్ మీదుగా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
పాకిస్థాన్తో మాట్లాడితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు.. “మనం ప్రయత్నం చేయాలి, కానీ వారు (బీజేపీ ప్రభుత్వం) విముఖంగా ఉన్నారు, వారు తమ ఓటు బ్యాంకు కోసం ముస్లింలు, హిందువులను ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోయడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ” అని ఆరోపించారు. పాకిస్థాన్లో నివసిస్తున్న హిందువులు, మన దేశంలోని ముస్లింల భద్రత గురించి పట్టించుకోకుండా విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆయన అన్నారు.
scrap: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు ఇక తుక్కే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
ద్వేషాన్ని వ్యాపింపజేసి ఓట్లు దండుకోవడానికి వారి దుస్థితిని ఉపయోగించుకోవడానికి ఒక సినిమా (ది కాశ్మీర్ ఫైల్స్) విడుదల చేయబడిందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగాలు ఇచ్చిన వారికి కూడా కాశ్మీర్లో ఉగ్రవాదం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం ప్రారంభమైనప్పటి నుండి కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు ఇద్దరూ బాధపడ్డారని, తన కార్యకర్తలు, మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో చంపబడ్డారని అబ్దుల్లా అన్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!