Narsaraopet Tension: టీడీపీ వర్సెస్ వైసీపీ …నరసరావుపేటలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడులు, హత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు. దీంతో అధికార పార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీ అండదండలతోనే దాడులు జరుగుతున్నాయని అరవింద్ బాబు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కోటప్పకొండ వేదికగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుకున్నారు టిడిపి, వైసిపి నాయకులు. ఈ నేపథ్యంలో నేడు కోటప్పకొండ వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేత అరవింద్ బాబు.
Read Also: Smriti Mandhana : కెప్టెన్ గా పనికిరాదు?.. స్మృతి మంధాన అసంతృప్తి..!
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
కోటప్పకొండ వెళ్లేందుకు అనుమతులు లేవంటూ అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నరసరావుపేటకు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీచేశారు. అయితే, టీడీపీ శ్రేణులు మాత్రం నరసరావుపేటకు వచ్చితీరతామంటున్నారు.నరసరావుపేట ప్రాంతం రొంపిచర్ల మండలం అలవల లో జరిగిన దాడి పై బహిరంగ చర్చకు రావాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు ,ప్రతి సవాళ్లు విసురుకున్నాయి..
రొంపిచర్ల మండలం అలవలపాడు లో కోటిరెడ్డి పై జరిగిన దాడి వ్యవహారంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని టిడిపి చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 13న సవాల్ విసిరారు.అయితే ఇదే అంశంపై ఈ నెల 20న టిడిపి ఇన్చార్జ్ అరవింద్ బాబు స్పందించారు… తాను ఉగాది రోజు కోటప్పకొండ త్రికోటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చకు వస్తున్నారని వైసీపీ నేతలు రావాలని ప్రతి సవాల్ విసిరారు …..దీంతో పల్నాడు ప్రాంతం నరసరావుపేట లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో ఈరోజు కోటప్పకొండ వెళ్లేందుకు సిద్ధమవుతున్న టిడిపి నేతను పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు ….. దీనిపై టిడిపి నేతలు స్పందిస్తూ తాము ఆరోపణలు చేసిన విధంగా ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిపై ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై జరుగుతున్న అన్యాయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు…
మరోవైపు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సైతం తాను బహిరంగ చర్చకు సిద్ధమే అని అంటున్నారు …. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో జరిగిన దాడి వ్యవహారంలో తాను ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తానని, పండుగ రోజు ప్రజలను అధికారులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని , ఈరోజు తప్పించి ఎప్పుడైనా బహిరంగ చర్చకు వస్తానని అంటున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు ,సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవటంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది..
Read Also:Ukraine: ఉక్రెయిన్ లో జపాన్ ప్రధాని కిషిడా ఆకస్మిక పర్యటన
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!