Gidugu Venkata Ramamurthy: దేశ భాషలందు తెలుగు లెస్స.. నేడు తెలుగు భాషా దినోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Venkata Ramamurthy: ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) పంతులు ముఖ్యుడు. ఆయన ఉపాధ్యాయుడిగా, చరిత్ర, శాసన పరిశోధకుడిగా, వక్తగా, విద్యావేత్తగా బహుముఖ రంగాల్లో విశేష సేవలందించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని(ఆగస్ట్ 29) మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలను నిజం చేస్తూ గిడుగు వారు తెలుగు భాషాకు చేసిన సేవలు ఏంటి, ఆయన కృషిని ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kamareddy, Medak Floods : అంతులేని నష్టాన్ని మిగిల్చిన కుంభవృష్టి
Also Read
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో తెలుగు భాష ఒకటిగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. దీనికి మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.
వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో ఒకరు..
ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1880లో ఆయన తన వృత్తి జీవితాన్ని పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టారు. అప్పటి నుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒడిశాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒడిశా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై గిడిగు వెంకట రామమూర్తి పంతులు తన అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.
ప్రతి తెలుగువాడిపై బాధ్యత ఉంది..
తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను గౌరవించటానికి మనం ప్రతి యేటా ఆగస్టు 29న ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. ఈక్రమంలో తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. తెలుగు భాష కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో కొందరు మాతృభాషపై మమకారాన్ని చూపించకపోగా.. తెలుగు భాషలో మాట్లాడటాన్ని అవమానంగా భావిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కనువిప్పు కలిగించడంతో పాటు, మన మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి.
తాజావార్తలు
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
-
Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
-
Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
-
AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..