Inflation : ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే
Inflation : చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత, సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం కొత్త షాక్ను ఎదుర్కోవచ్చు. ఈ షాక్ను టెలికాం కంపెనీలు ఇవ్వవచ్చు. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచే యోచనలో ఉన్నాయని తాజా నివేదిక సూచిస్తుంది. దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్లను ఎప్పుడైనా పెంచుతున్నట్లు ప్రకటించవచ్చు. ఇదే జరిగితే జూన్లో ముగిసే ఎన్నికల తర్వాత ప్రజలు మొబైల్ ఫోన్లు వాడడం ఖరీదు కానుంది.
జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం టారిఫ్లను పెంచే అవకాశం ఉందన్న భయం నెలకొంది. అయితే దీనిపై మొబైల్ కంపెనీలు ఇంకా అధికారికంగా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చి నెలలో కూడా ద్రవ్యోల్బణం ఉపశమనం క్రమంలోనే కొనసాగింది. ఒకరోజు క్రితం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు వచ్చింది.
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
Read Also:PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
జూన్ వరకు ఎన్నికలు
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏడు దశల లోక్సభ ఎన్నికలు 2024 ఈ నెల నుండి ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ మొదటి వారంలో జూన్ 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
మరింత లాభపడిన ఎయిర్టెల్
యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం, టారిఫ్లను పెంచడం వల్ల టెలికాం కంపెనీలు లాభపడనున్నాయి. భారతి ఎయిర్టెల్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంటుంది. ఎయిర్టెల్ సగటు ఆదాయం ఒక్కో వినియోగదారు (ARPU) ప్రస్తుతం రూ.208. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.286కి పెరగవచ్చు. నివేదిక ప్రకారం, జియో ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో అతిపెద్ద కంపెనీ. గత 5-6 సంవత్సరాలలో, జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుండి 39.7 శాతానికి పెరిగింది.
Read Also:Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చి వేసిన పాకిస్తాన్
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!