Inflation : ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం షాక్.. ఫోన్ వినియోగదారులకు భారమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inflation : చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత, సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం కొత్త షాక్ను ఎదుర్కోవచ్చు. ఈ షాక్ను టెలికాం కంపెనీలు ఇవ్వవచ్చు. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచే యోచనలో ఉన్నాయని తాజా నివేదిక సూచిస్తుంది. దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్లను ఎప్పుడైనా పెంచుతున్నట్లు ప్రకటించవచ్చు. ఇదే జరిగితే జూన్లో ముగిసే ఎన్నికల తర్వాత ప్రజలు మొబైల్ ఫోన్లు వాడడం ఖరీదు కానుంది.
జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం టారిఫ్లను పెంచే అవకాశం ఉందన్న భయం నెలకొంది. అయితే దీనిపై మొబైల్ కంపెనీలు ఇంకా అధికారికంగా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చి నెలలో కూడా ద్రవ్యోల్బణం ఉపశమనం క్రమంలోనే కొనసాగింది. ఒకరోజు క్రితం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు వచ్చింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also:PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
జూన్ వరకు ఎన్నికలు
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏడు దశల లోక్సభ ఎన్నికలు 2024 ఈ నెల నుండి ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ మొదటి వారంలో జూన్ 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
మరింత లాభపడిన ఎయిర్టెల్
యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం, టారిఫ్లను పెంచడం వల్ల టెలికాం కంపెనీలు లాభపడనున్నాయి. భారతి ఎయిర్టెల్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంటుంది. ఎయిర్టెల్ సగటు ఆదాయం ఒక్కో వినియోగదారు (ARPU) ప్రస్తుతం రూ.208. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.286కి పెరగవచ్చు. నివేదిక ప్రకారం, జియో ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో అతిపెద్ద కంపెనీ. గత 5-6 సంవత్సరాలలో, జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుండి 39.7 శాతానికి పెరిగింది.
Read Also:Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చి వేసిన పాకిస్తాన్
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!