TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇచ్చే సిఫార్సు లేఖల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనం మరియు రూ. 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధులు ఈ పోర్టల్ ద్వారానే సిఫార్సు లేఖలను తయారు చేసి, వాటిని సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం భక్తులకు అసలు లేఖను అందజేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ఒక ప్రత్యేకమైన సమర్థమైన విధానం నెలకొంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ పోర్టల్లో నమోదైన లేఖల వివరాల ప్రకారమే టీటీడీ భక్తులకు దర్శన అనుమతులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. పోర్టల్లో లేనికాని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించదని తెలియజేశారు. ప్రజాప్రతినిధులకు ఈ పోర్టల్ను ఎలా ఉపయోగించాలో వివరించే యూజర్ గైడ్ కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఈ కొత్త విధానాన్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్