Congress : తెలంగాణలో పీసీసీ అబ్జర్వర్ల నియామకం.. 70 మంది నేతలకు బాధ్యతలు
- గ్రామస్థాయి పరిశీలనతో అబ్జర్వర్ల బాధ్యతలు ప్రారంభం
- పదవుల కోసం కార్యకర్తల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యం
- డీసీసీ అధ్యక్షుల ఎంపికకు జిల్లాల వారీగా ఏఐసీసీ అబ్జర్వర్లు
Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అబ్జర్వర్లను నియమించింది. బుధవారం గాంధీ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు ఇద్దరు చొప్పున మొత్తం 70 మంది నేతలను అబ్జర్వర్లుగా నియమించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు మహిళా నేతలకు కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ నియామకంపై సమావేశంలో టీఎస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా చర్చించారు. మహిళా నేతలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం.
అబ్జర్వర్ల జాబితాలో ఎమ్మెల్యేలు డా. బీ. మురళీనాయక్, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, మహిళా నేతలు భీమగంటి సౌజన్యగౌడ్, రవళిరెడ్డి, లకావత్ ధన్వంతి, బోజ్జ సంధ్యారెడ్డి ఉన్నారు. ఈ అబ్జర్వర్లు ఏప్రిల్ 25 నుండి మే 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ముందుగా ఏప్రిల్ 25-30 మధ్య జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు, మండలాల వివరాలు, ఇతర కీలక సమాచారం సేకరించనున్నారు. జిల్లా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకుని, పదవుల కోసం ప్రతిపాదనలను రూపొందిస్తారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ప్రతి బ్లాక్కు మూడు, మండలానికి ఐదు, గ్రామానికి మూడు పేర్లను ప్రతిపాదించే విధంగా కమిటీలు నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలు టీపీసీసీకి పంపించి, అక్కడి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తరఫున కూడా అబ్జర్వర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుది చర్చ, నిర్ణయాలు తర్వాతి దశలో ఉంటాయని టీపీసీసీ వెల్లడించింది. గుజరాత్ తరహాలో ఏఐసీసీ ఒకే ఒక అబ్జర్వర్ను జిల్లాకు పంపిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయనున్నట్లు సమాచారం.
Pahalgam terror attack: ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!