Telangana Panchayat Elections: మెదక్ జిల్లాలో హైడ్రామా.. సానుభూతి ఓట్ల కోసం ఏకంగా భర్తనే..!
- మెదక్ జిల్లా చేగుంట మండలంలో హైడ్రామా
- గొల్లపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త అదృశ్యం
- డ్రోన్లు, జాగిలాలతో గాలించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి అదృశ్యం అయ్యాడు. తన భర్తను ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ సబిత పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో గాలించారు. చివరకు సబిత భర్త జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Also Read
ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు సబిత, జనార్ధన్ రెడ్డి డ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసం సబిత ఇలా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి జనార్ధన్ రెడ్డి ప్రచారం చేస్తుండగా.. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకుని పరుగెత్తాడని డీఎస్పీ నరేందర్ గౌడ్ చెప్పారు. వరి చేన్లలో పరుగెత్తుతుండగా దెబ్బ తాకిందని, సృహ కోల్పోయానని జనార్ధన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై డీఎస్పీ సమగ్ర విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!