TKA : తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో రూ.1.20 కోట్లు మాయం..
- తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో కోట్లాది నిధుల దుర్వినియోగం
- మాజీ సంయుక్త కార్యదర్శి ఫిర్యాదు
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను కూడా పక్కదారి పట్టించారని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TKA : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ను తీవ్ర ఆరోపణలు కకావికలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్ , కోశాధికారి కె.బి. శ్రీరాములుపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత 40 ఏళ్లుగా వారు పదవుల్లో కొనసాగుతూ సంఘ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్-జిల్లా కబడ్డీ టోర్నమెంట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా సంఘాలకు పంపకుండా వారు స్వాహా చేశారని సురేష్ పేర్కొన్నారు.
Vemulawada : ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష.. మరో ఐదు కోడెల మృతి
Also Read
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
అసోసియేషన్కు అధికారికంగా ఒకే బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికీ, అదనంగా అనధికారిక ఖాతా ఓపెన్ చేసి దాదాపు రూ.60 లక్షలు విత్డ్రా చేశారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను సైతం వీరు దారి మళ్లించారని సురేష్ తెలిపారు. 2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం విడుదలైన రూ.1.20 కోట్లలో రూ.50 లక్షలను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అన్నారు. ఏజీఎం, ఈసీ సమావేశాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే సంఘ నిధులను జగదీష్ యాదవ్, శ్రీరాములు ఇష్టారీతిన వాడుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం చింతల స్పోర్ట్స్ సంస్థ ఇచ్చిన రూ.20 లక్షల నిధులు కూడా జిల్లా సంఘాలకు ఇవ్వకుండా దుర్వినియోగం చేశారని సురేష్ వివరించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకే తనను మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుండి అన్యాయంగా తొలగించారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుతో నిధుల వినియోగంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
తాజావార్తలు
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!