IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025 సీజన్లో రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ నేడు ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్కు ముందు అభిమానులు వర్షం పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? వర్షం వస్తే ఎవరు ఫైనల్కు అర్హులు అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
Read Also: PBKS vs MI: నేడే క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ పంతమా..? ముంబై మాస్టర్ ప్లానా..? ఫైనల్ చేరేదెవరు..!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక అహ్మదాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. నేడు వాతావరణం కొద్దిగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, వర్షం వచ్చే అవకాశాలు కేవలం 5% మాత్రమే ఉంది. సగటుగా 34°C వరకు వాతావరణం ఉంటుంది. మ్యాచ్ సమయంలో సాయంత్రం 29°C వరకు తగ్గే అవకాశం ఉంది. వాన అనేది పెద్దగా సమస్య కాకపోవచ్చని అంచనా. సాధారణంగా మ్యాచ్కు ఎటువంటి అంతరాయం లేకుండా సాగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే (నో టాస్, నో ఓవర్), బీసీసీఐ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును ఫైనల్కు పంపుతారు. ఈ నిబంధనల ప్రకారం పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్గా 19 పాయింట్లతో ముగించినందున, వారు నేరుగా జూన్ 3న జరిగే ఫైనల్కు అర్హత పొందుతారు.
Read Also: Always Shubhu Baby: హార్దిక్, శుభ్మన్ గిల్ మధ్య గొడవ.. “ఆల్వేస్ శుభూ బేబీ” అంటూ..!
బీసీసీఐ IPL 2025 సీజన్ కోసం కొత్త వర్ష నిబంధనలను ప్రవేశపెట్టింది. గతంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయితే, ఒక గంట లేదా 90 నిమిషాల తర్వాత ఓవర్లను తగ్గించడం జరుగుతుండేది. కానీ ఈసారి, మ్యాచ్ మొదలు కావడానికి అదనంగా 2 గంటల సమయం ఇవ్వనున్నారు. అంటే ఉదాహరణకు, మ్యాచ్ ఆలస్యం అయితే రాత్రి 10:30 గంటల వరకు కూడా మ్యాచ్ మొదలు కావచ్చు ఎలాంటి ఓవర్ల తగ్గింపు లేకుండా. అలాగే, ఆటలో వర్షం కారణంగా ఆట నిలిపివేసినా, రాత్రి 2 గంటల వరకు మ్యాచ్ కొనసాగించవచ్చు. సాధారణంగా మ్యాచ్ 12 గంటలలోపు ముగియాలి. కానీ, ఇప్పుడు ఇది రాత్రి 2 వరకు పొడిగించవచ్చు. ఈ క్వాలిఫయర్ 2 మ్యాచ్లో విజేత జట్టు, జూన్ 3న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఎదుర్కొంటుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!