CM KCR : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కోతలను అధిగమించి అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ పారిశ్రామిక సేవా వ్యాపార రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికతతో విద్యుత్ ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించుటకు అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2014లో ఉన్న 7778 MW విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని , 2023 నాటికి 18567 MW లకు పెంచడం జరిగింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ లను కూడా ప్రభుత్వం భారీగా విస్తరించింది. ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ 9 ఏoడ్లలో రూ.97,321 కోట్లను వ్యయం చేసింది. రాష్ట్ర సర్వతముఖాభివృద్ధికి దోహదపడే వర్గాలకు ఊతంగ నిలిచేoదుకు భారీ ఎత్తున విద్యుత్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహ, ఉపాధి, వ్యవసాయ రంగాలకు చెందిన 72 లక్షల 41 వేల మంది వినియోదారుల కు సరఫరా చేసిన విద్యుత్ పైన రూ.50 వేల కోట్ల పైబడి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. రైతులు, వివిధ అల్పాదాయ వర్గాల ఆర్థికాభివృద్ధికి , జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి సబ్సిడీ పైన ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ ఊతంగా నిలుస్తున్నది. మొత్తం 27 లక్షల 48 వేల 598 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నది.
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
అల్పాదాయ, బడుగు బలహీనవర్గాలకు విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. నెలకు 0-50 యూనిట్స్ విద్యుత్ వినియోగించే గృహ వినియోగ దారు లు 35 లక్షల 61 వేల 809 కుటుంబాలు, నెలకు 101 యూనిట్స్ లోపు విద్యుత్ వాడుతున్న లక్షల 25 వేల 433 షెడ్యుల్ కులాల వినియోగదారులు , 2 లక్షల 95 వేల 114 మంది షెడ్యుల్ తెగల వినియోగదారులు ప్రభుత్వ నిర్ణయంతో లబ్దిపొందుతున్నరు. అలాగే నెలకు 250 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న 6494 మంది పౌల్ట్రీ ఫార్మ్ దారు లు, 32,654 హెయిర్ కటింగ్ సెలూన్ దారులు, 65,806 లాండ్రీ షాపుల వారు, 56 దోభి ఘాట్స్ లబ్దిదారు లు విద్యుత్ సబ్సిడీ ప్రయోజనం పొందుతున్నారు. వీరితో పాటు 5011 మంది పవర్ లూమ్ లకు, 39 స్పిన్నింగ్ మిల్స్ కు సబ్సిడీ పైన ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్న ది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ తో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు లభించాయి.’ అని విద్యుత్ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..