CM Revanth Reddy : అత్యధిక ద్రవ్యోల్బణం నుండి అత్యల్ప స్థాయికి.. ప్రజల ప్రభుత్వం ప్రగతి ఇది
- ఒకే రాష్ట్రం – రెండు కాలాల వ్యత్యాసం: అధిక ద్రవ్యోల్బణం నుండి ఉపశమన దిశగా
- ఉచిత ప్రయాణం నుండి ఆరోగ్య బీమా వరకూ – ప్రజల పక్షాన మారిన పాలన
- "ఇది ప్రజల ప్రభుత్వం" – సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించిన మార్పు చిహ్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భాలు తరచూ చూశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ప్రజానీకాన్ని కేంద్రీకరించి అమలు చేస్తున్న విధానాలు తక్షణ ఉపశమనం కలిగించాయన్నారు.
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్న పలు కీలక కార్యక్రమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. అవేంటంటే..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం సాధ్యమైంది.
కేవలం ₹500కి LPG సిలిండర్ : గ్యాస్ సిలిండర్ ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినూత్నంగా నిలిచింది.
200 యూనిట్లు ఉచిత విద్యుత్ : ఇళ్లకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇవ్వడం ద్వారా మధ్య తరగతి మరియు పేద కుటుంబాలకు భారం తగ్గింది.
రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ కవరేజ్ : ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పరిష్కారంగా, సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులను భరించే అవకాశం.
రేషన్ కార్డు దారులకు చక్కటి బియ్యం పంపిణీ : ఇప్పటికే ఉన్న రేషన్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, అధిక నాణ్యత కలిగిన బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పోషకాహార భద్రతను పెంచారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చివర్లో, “ఇది మార్పు..!! ఇది ప్రజల ప్రభుత్వం..!!” అంటూ తన ప్రభుత్వ తీరును గర్వంగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా చర్యలు తీసుకుంటామని, ఇది సరళమైన హామీ కాదని – అమలులోనే చూపిస్తున్నామని తెలిపారు.
Nidadavolu Municipality: వైసీపీకి మరో బిగ్ షాక్..! జనసేన ఖాతాలోకి నిడదవోలు..
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!