Tarun Chugh: ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్.. తరుణ చుగ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh: ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారని తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో అయినా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఏది కూడా నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందన్నారు. కేసీఆర్ సర్కార్ ను వైట్ వాష్ చేసి పంపిస్తారని తెలిపారు. నువ్ ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? అని ప్రశ్నించారు. కేసీఆర్ ది సిగ్గు, శరం లేని ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు ఏది కేసీఆర్? ఎందరికి ఇచ్చావు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం అత్యాచారం చేస్తోందన్నారు. కేసీఆర్ ఒక రాజాబాబు అంటూ వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారు? ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు. యువత గురించి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. నిరుద్యోగులకు, యువతకు అండగా మేముంటామని తరుణ్ చుగ్ అన్నారు. 10 ఏండ్లుగా యువతకు అన్యాయం జరిగింది తప్పితే న్యాయం మాత్రం జరగలేదని అన్నారు. దేశంలో ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందని ఆరోపించారు. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్.. బై.. బై.. అంటూ తరుణు చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!