Justice Radhakrishnan Away : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ జడ్జ్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్(63) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోల్ కత్తా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దీంతో పాటు రాధాకృష్ణన్ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ తాత్కాలిక ఛైర్మన్ గా కూడా ఉన్నారు.
Also Read : Anirudh: న్యూజెర్సీలో ‘ఎన్టీఆర్ 30’ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుద్
Also Read
రాధాకృష్ణన్ కొత్తగా ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రాంలోని ప్రత్యేక హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్ 29న జన్మించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా తన కేరీర్ ప్రారంభించారు.
Also Read : Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
టీబీ రాధాకృష్ణన్ 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండుసార్లు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. కేరళ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ గానూ కొనసాగించారు. 12 ఏళ్ల కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన తర్వాత కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!