Gangula Kamalakar: బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. ఇకనుంచి ప్రభుత్వమే ఫీజు చెల్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీలకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్మెంట్ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.. ఈ పథకంకు సంబంధించి శుక్రవారం విధివిదానాలు ఖరారవుతాయని పేర్కొన్నారు.
Vijay Devarakonda : మరో పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్న విజయ్ దేవరకొండ…?
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ప్రీ మెట్రిక్ లాగే పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం లాంటి సౌకర్యాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విద్యకోసం ఉన్న స్కీంలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి లోగో, పేరు శుక్రవారం ఖరారు చేస్తామన్నారు.
తెలంగాణ రాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో బీసీ కులాల వారు ఉన్నత చదువులకు దూరమై కపలవృత్తులకే పరిమితమయ్యేవారని ఆయన అన్నారు. తెలంగాణకు ముందు 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవని.. ఇప్పుడు 327 బీసీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు.
Pawan Kalyan: పవన్ కౌంటర్… రోజా భర్తకేనా?
ఇప్పుడు బీసీ విద్యార్థులు చదువుకునేందుకు డిగ్రీ దాకా బీసీ గురుకులాలున్నాయని మంత్రి గంగుల తెలిపారు.1.87 లక్షల పిల్లలు ఆ గురుకులాల్లో చదువుతున్నారని మంత్రి పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించడం సంతోషంగా ఉందని.. బీసీలకు విద్యాప్రధాత సీఎం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరుతోనే ఈ స్కీం ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బీసీలు గ్రూప్-1, సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారని.. బీసీల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?