Governor Jishnu Dev Varma: “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- "మైల్స్ ఆఫ్ స్మైల్స్" మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- ప్రముఖ డాక్టర్ ఎంఎస్ గౌడ్ రచించిన పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Jishnu Dev Varma: నేడు ఉదయం10.30 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో డాక్టర్ ఎం.ఎస్.గౌడ్ రచించిన “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు. డాక్టర్ ఎంఎస్ గౌడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లకు డెంటల్ సర్జన్, ఇండియన్ ప్రోస్టోడోంటిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు. డాక్టర్ ఎం.ఎస్. గౌడ్ ఒక విశిష్టమైన దంత నిపుణులుగా ఉన్నారు. 2013లో ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (IBC), కేంబ్రిడ్జ్ ద్వారా ప్రపంచంలోని టాప్ 100 హెల్త్ ప్రొఫెషనల్స్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాస్మెటిక్ డెంటిస్ట్రీ, డెంటల్ లేజర్స్, డెంటల్ ఇంప్లాంట్లను పరిచయం చేశారు. దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తున్నారు.
Read Also: Ponguleti Srinivas Reddy : టెక్స్టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది..
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
నోటి ఆరోగ్యం, దంత సమస్యలు, చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఐదు వేర్వేరు భాషల్లో ఎనిమిది పుస్తకాలను ప్రచురించారు. తెలుగులో ఆయన మొదటి పుస్తకం, ‘మీ చిరునవ్వును సరిదిద్దుకోండి (1997)’.. దంత ఆరోగ్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఒక సంచలనాత్మక ప్రయత్నం. అప్పటి నుంచి ఆయన హిందీ, ఉర్దూ, తమిళం, ఆంగ్లంలో ఇలాంటి రచనలను రచించారు. ఆధునిక దంతవైద్యం గురించి అవగాహన పెంచుకోవడంలో తన నిబద్ధతను మరింత పెంచుకున్నారు.
ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తాజా పుస్తకం “మైల్స్ ఆఫ్ స్మైల్స్” ఆధునిక దంత సంరక్షణ, సాంకేతికతల ద్వారా తరతరాలుగా చిరునవ్వులు చిందించాలనే ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. 1984లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశపెట్టడం నుంచి 1990లో డెంటల్ లేజర్ల వినియోగాన్ని, 1998లో డెంటల్ ఇంప్లాంట్లు, 2015లో క్లియర్ అలైన్నర్లను ఉపయోగించడం వరకు.. డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఆవిష్కరణలు ఈ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. పుప్పాలగూడలో ఇటీవల ప్రారంభించిన హైటెక్ సదుపాయం ఈ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!