MLA’s Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలోనే తీర్పునిచ్చింది. అయితే.. దీనిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా సీబీఐకి బదిలీ చేయడం సమంజసమే నంటూ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని సీనియర్ సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే కోరారు.
Also Read : Superstition: తల్లిదండ్రులా.. రాక్షసులా.. 3 నెలల పసిపాపను కాల్చడానికి మనసేలా వచ్చిందిరా
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అయితే.. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని తెలంగాణ ప్రభుత్వం తరుఫు లాయర్ సుప్రీంకు విన్నవించారు. దీనిపై సీజేఐ స్పందింస్తూ.. పిటిషన్ ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకు రావాలని దుష్యంత్ దవేను సూచించారు. పిటిషన్ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే దాన్ని వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని వెల్లడించారు సీజేఐ. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని సీజేఐ పేర్కొన్నారు.
Also Read : TS Common Entrance Test : విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..