TS TET 2023 : తెలంగాణాలో మరోసారి టెట్ నిర్వహించబోతున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ మరియు డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గత సంవత్సరం జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన సంఘం తెలిసిందే.ఈ మేరకు మంత్రి వర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయం తీసుకుంది.బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన టెట్ ను సంవత్సరానికి ఒకసారి కూడా నిర్వహించడం లేదు. అయితే త్వరలో టీచర్ రిక్రూట్ మెంట్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించనున్నారు . టెట్ తర్వాతనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.నేడు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ఈ క్యాబినెట్ సమావేశంలో విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.
విద్యా శాఖ లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ అలాగే మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది.. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి మరియు జగదీశ్రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని అయితే నిర్ణయించింది. ఇక టెట్ లో గత ఏడాది కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం అయితే ఉండేది. డీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 1 ను రాసుకునే వారు.. కానీ గత సంవత్సరం నిర్వహించిన టెట్ పరీక్షలో బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 ను రాయడం జరిగింది.జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించే టెట్ కూడా బీఈడీ అభ్యర్థులు రెండు పేపర్లు రాసుకోవచ్చు
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!