Telangana: ప్రజాపాలనా విజయోత్సవాలకు గవర్నర్, కేసీఆర్, కిషన్ రెడ్డికి ఆహ్వానం
- ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
- తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పలువురికి ఆహ్వానం
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్లో గవర్నర జిష్ణుదేవ్ వర్మను, దిల్కుషా అతిథిగృహంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రజాపాలనా విజయోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాలను అందజేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో మంత్రి సమావేశమయ్యారు. గంట 15 నిమిషాల పాటు మాజీ సీఎం కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య సమావేశం సాగింది. కేసీఆర్తో కలిసి మంత్రి లంచ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకకి రావాలని ప్రభుత్వం తరపున కేసీఆర్కు మంత్రి పొన్నం, ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానం అందించారు. మంత్రి వెంట అధికారులు, రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు.
Read Also: Gun Fire: బావ బావమరిదిల మధ్య వివాదం.. ఎయిర్గన్తో కాల్పులు
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వం తరపున తాను, ప్రోటోకాల్ అధికారులు వచ్చామని తెలిపారు. తెలంగాణలో అందరిని గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. లంచ్ టైంలో వచ్చాము కాబట్టి కేసీఆర్ లంచ్ చేయమంటే చేశామన్నారు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. మేము అందరిని ఆహ్వానిస్తున్నాం కేసీఆర్ వస్తారా..? రారా..? అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారననారు. వస్తారా.. రారా.. అనేది కేసీఆర్ ఇష్టమని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో