New Liquor Brands: కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..
- కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
- అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శకత
- కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు
- నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు దరఖాస్తులు తీసుకోవద్దని.. కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానం అనుసరించాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి నిర్ణీత వ్యవధిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
READ MORE: Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
“ఇష్టమోచ్చిన చెత్త పేర్లతో వచ్చేవి.. నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ. బీరు బిర్యానీ లాంటి బీర్ బ్రాండ్లకు చెక్ పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత కంపెనీలు కొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో వాటిని పరిశీలించి అనుమతించే పద్ధతి అనుసరించాలి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న ఎలైట్ బార్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో త్వరలో కొత్త విధానం తెస్తున్నాం. గతంలో టానిక్ లాంటి ఎలైట్ షాపులకు అనుమతించటంతో బడా వ్యాపారులు ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట పెట్టుకున్నారు. తాము ఆడిందే ఆట అన్నట్లుగా ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలి.” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా కొత్త ప్రతిపాదనలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..