Telangana: విద్యుత్ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి
- విద్యుత్తు రంగంలో కొత్త విప్లవం
- అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి
- ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత కరెంట్
- వ్యవసాయానికి నిరాటంకంగా ఉచిత విద్యుత్తు
- దేశంలోనే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్లో రికార్డు
- విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, పునరుత్పాక విద్యుత్తుపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ట్రాన్స్కో, జెన్కోతో పాటు డిస్కంలు.. విద్యుత్తు సంస్థన్నింటా దుబారాను తగ్గించి విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కొత్త పునరుజ్జీవ ఇందన విధానం (రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ) రూపొందిస్తోంది.
దివాళా బాటలో ఉన్న విద్యుత్తు సంస్థలను గాడిలో పెట్టేందుకు తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మక విధానాలు అనుసరించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి భారీ అప్పులు, వేల కోట్ల నష్టాలతో విధ్వంసమైన తీరుపై శ్వేత పత్రం విడుదల చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా కొనసాగించింది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి ఏడాదిలోనే రూ. 10,444 కోట్లు ఉచిత విద్యుత్తు సబ్సిడీ భారాన్ని భరించింది. దాదాపు 29 లక్షల మంది రైతులు ఉచిత కరెంట్ ద్వారా లబ్ధి పొందారు.
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
Read Also: KTR: చరిత్ర చదవకుండా.. భవిష్యత్ను నిర్మించలేం..!
గత పదేండ్లలో దాదాపు రూ.20 వేల కరెంటు ఛార్జీల మోత మోసిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్రంలో 1.85 కోట్ల మంది వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వినియోగదారులకు విద్యుత్తు అందిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు అందించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 39067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. దీనికి ప్రభుత్వం రూ. 101.57కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. రోజువారీ అత్యధిక విద్యుత్తు డిమాండ్లో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా పెద్ద రాష్ట్రాలను సైతం అధిగమించింది. గత ఏడాది 2023 ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్లో ఎనిమిదో ర్యాంకులో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది అయిదో ర్యాంకుకు చేరింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15,623 మెగావాట్ల ఆల్ టైమ్ హై పీక్ డిమాండ్ విద్యుత్తును సమర్థంగా సరఫరా చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.
Read Also: CM Revanth Reddy: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం
గత ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలతో ఏళ్లకేళ్లు ఆలస్యమైన యాదాద్రి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి దశలోని రెండు యూనిట్ల నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. సెప్టెంబర్ 12న యూనిట్ 1, 2 గ్రిడ్కు అనుసంధానం చేశారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 800 మెగావాట్ల ఒక యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. దేశంలోనే వినూత్నంగా మహిళా శక్తి సంఘాల అధ్వర్యంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో సంఘం అధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో నూటికి నూరు శాతం సౌర విద్యుత్తు వినియోగించే మోడల్ ప్రాజెక్టును చేపట్టింది. రెప్పపాటు కోత లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు, ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లను నెలకొల్పుతోంది.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!