Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!
- తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు విడుదల
- మే 1నుంచి మే 31 వరకు బదిలీలకు అవకాశం
- 01-01-2026 నాటికి ఒకే స్థానంలో కనీసం 3 సంవత్సరాలు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు
- భార్య/భర్త కారణాలతో బదిలీ కోరే వారికి 3 సంవత్సరాల షరతు నుంచి మినహాయింపు
- 31-12-2025 నాటికి ఒకే చోట 4 సంవత్సరాలు పూర్తి చేసినవారిని తప్పనిసరిగా బదిలీ
- 4 సంవత్సరాలకు పైగా కొనసాగించరాదని స్పష్టం
- 31-05-2027 లోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Employee Transfers: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు పనిచేసిన కాలం, వ్యక్తిగత పరిస్థితులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మే 1నుంచి మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 01-01-2026 నాటికి ఓ నిర్దిష్ట స్థానంలో కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అయితే జీవిత భాగస్వామి కారణాలతో బదిలీ కోరే ఉద్యోగులకు ఈ మూడు సంవత్సరాల షరతు వర్తించదు. వారికి ప్రత్యేక సడలింపు ఇవ్వబడింది.
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
Also Read
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
అదేవిధంగా 31-12-2025 నాటికి ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే, రిటైర్మెంట్కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-05-2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు.

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
ఇక పరిపాలనలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఒకే కేడర్లో 40% కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలతో బదిలీ ప్రక్రియను సమతుల్యంగా నిర్వహించాలనే ఉద్దేశం ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్గదర్శకాలతో ఉద్యోగుల బదిలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉండనుంది.
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!