Kishan Reddy: కామారెడ్డిలో బీజేపీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు: కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయమని అన్నారు. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం అని కిషన్ రెడ్డి పేరొన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించడంతో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు కిషన్ రెడ్డి కామారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గౌరవిస్తున్నాం. కామారెడ్డిలో విజయం సాధించిన వెంకట రమణారెడ్డికి శుభాకాంక్షలు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించిన ప్రజలకు అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయం. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం. బీజేపీ ఓటింగ్ పెరిగింది. ఎన్నికల్లో మా కీలక నేతలు ఓడిపోవడం దురదృష్టకరం. నిర్మాణాత్మక ప్రతిపక్షంలా ఉంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
‘కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఓడించాం. పార్లమెంట్ కి సెమీఫైనల్ ఎన్నికలుగా ఈ ఎన్నికలు సాగాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం సంతోషం. ఇదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తాం. తెలంగాణలో ఈసారి అన్ని ఎంపీ సీట్లు గెలుస్తాం. మా తప్పిదాలను సవరించుకుంటాం. త్వరలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో జాతీయ నాయకుల సమావేశం, భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..