Glass Tube Center : రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..
- తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్ సైన్స్ రంగం..
- ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ..
- పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధికి ప్రభుత్వంతో ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glass Tube Center: తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తన కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎమర్జింగ్ ఇన్నొవేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీ రెన్ ఆధ్వర్యంలోనే కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పందాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ రంగాలలో తెలంగాణను అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో కార్నింగ్ భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిగాయి. 2025 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (FCT) హబ్లో కార్నింగ్ కంపెనీ కూడా పాల్గొంటోంది.
Read also: Gaddar Memorial: నక్లెస్ రోడ్డులో గద్దర్ స్మృతి వనం.. సర్కార్ కీలక నిర్ణయం
Also Read
కార్నింగ్ కంపెనీ ఔషధ, రసాయన పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీకి గణనీయంగా దోహదపడుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫ్లో రియాక్టర్ల సాంకేతికతను కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ గాజు ట్యూబ్ లను ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. వీటిని తయారు చేయడానికి కంపెనీ వినూత్న వేగంతో కూడిన గాజు-పూత సాంకేతికతను ఉపయోగిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగం ఉత్పాదకతను ఈ కొత్త సదుపాయం మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వివింట్ ఫార్మా ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం సమావేశమైంది. రూ. 400 కోట్లు, కంపెనీ విస్తరణకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా తెలిపింది.
Paris Olympics 2024: ఒలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ ఇదే.. అత్యంత ముఖ్యమైన రోజు! పతకాలు పక్కా
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!