Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.
- ధాన్యం బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి.
- సౌర విద్యుత్ పై సబ్సిడీ ఇవ్వాలని కోరిన మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో 2014-15 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే, సీఎంఆర్ (CMR) డెలివరి గడువును పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి
శ్రీ ప్రహ్లాద్ జోషీతో భేటీ కావడం జరిగింది.2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు…రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు వెంటనే…విడుదల చేయాలని… pic.twitter.com/kYra4iONit
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2025
ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీ విషయమై మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుండి తెలంగాణకు సుమారు రూ.2,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో సంబంధిత పత్రాలను సమర్పించలేదని.. ఇప్పుడు తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, అలాగే వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే, సౌర విద్యుత్ పై సబ్సిడీ కోరినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ప్రధాని కుసుమ్’ పథకం కింద మహిళ సంఘాలకు 4,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, దీనికి సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీతో సహా, సోలార్ పంపులను అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీటి పై సానుకూలంగా స్పందించి, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!