Pralhad Joshi: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.
- ధాన్యం బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి.
- సౌర విద్యుత్ పై సబ్సిడీ ఇవ్వాలని కోరిన మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్టులో 2014-15 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే, సీఎంఆర్ (CMR) డెలివరి గడువును పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి
శ్రీ ప్రహ్లాద్ జోషీతో భేటీ కావడం జరిగింది.2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు…రూ.1,468.94 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు వెంటనే…విడుదల చేయాలని… pic.twitter.com/kYra4iONit
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2025
ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీ విషయమై మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుండి తెలంగాణకు సుమారు రూ.2,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో సంబంధిత పత్రాలను సమర్పించలేదని.. ఇప్పుడు తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, అలాగే వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే, సౌర విద్యుత్ పై సబ్సిడీ కోరినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ప్రధాని కుసుమ్’ పథకం కింద మహిళ సంఘాలకు 4,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, దీనికి సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీతో సహా, సోలార్ పంపులను అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వీటి పై సానుకూలంగా స్పందించి, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!