CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబడి పెంపు, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలపై హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లో తేవాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆధారమైన జీఎస్టీ రాబడులను పెంచుకోవడంతో పాటు పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించాలని నిర్ణయించారు. వ్యాపారాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తూనే ఈ నూతన సాంకేతికతను వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసేలా ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను వాణిజ్య పన్నుల అధికారులకు అందుబాటులోకి తేనున్నారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో జరిగే పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు ఇచ్చే ప్రాథమిక దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అయ్యే పన్నుల అంచనాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ పన్నుల సమాచారంతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వంటి కీలక పథకాల వివరాలను కూడా ఒకే చోటకు చేరిస్తే పరిపాలన మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండానే పన్నుల వసూళ్లను పెంచడానికి సాంకేతికత ఎంతగానో తోడ్పడుతుందని అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!