Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమాచారం కోసం ఈ నంబర్స్కి కాల్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Bus Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంప్రదింపులు జరిపారు. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో +91 79979 59754, +91 99129 19545 నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
READ MORE: Smartphone Sales: భారీగా పెరిగిన స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో ఆపిల్ సేల్స్..!
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
అసలు ఏం జరిగింది..?
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా సమాచారం ప్రకారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ బృందం హైదరాబాద్కు చెందినదని చెబుతున్నారు. ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తోంది. మదీనా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఎంత మంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా లభించలేదు. 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరణించారని అనధికారిక సమాచారం. సివిల్ డిఫెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని కారణంగా, మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం, భారతీయ ఏజెన్సీలు, ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!