నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా 9 మంది మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే BAC సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఐదుకు పైగా బిల్లులను ఆమోదింప జేయాలనే ఆలోచనతో ఉంది KCR ప్రభుత్వం. ఇందులో దళిత బంధుకు సంబంధించిన చట్టం కూడా ఉంటుందని తెలుస్తోంది. అటు విపక్షాలు కూడా దళితబంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్.
Also Read
అలాగే, వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటోంది. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని నిర్ణయించింది బీజేపీ. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ అంశంతో పాటు ఉద్యోగ నియామకాలపైనా TRS ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి విపక్ష పార్టీలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..