Telangana Assembly : తెలంగాణ శాసనసభలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానం
- లోక్సభ పునర్విభజనపై తెలంగాణ అసెంబ్లీ ఆందోళన
- దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
- నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శక సంప్రదింపులు లేకుండానే కేంద్రం ఈ కసరత్తును కొనసాగిస్తోందని సభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, పునర్విభజన విషయంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని, ప్రస్తుత సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తీర్మానంలో స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని సభ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జనాభా నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని, తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పెంచాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని సభ కోరింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తక్షణమే చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, సిక్కిం పునర్విభజన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకోవాలని సభ డిమాండ్ చేసింది.
ఈ తీర్మానం ద్వారా తెలంగాణ శాసనసభ, దక్షిణాది రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు బలమైన సంకేతం పంపిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఐక్యంగా నిలవాలని సూచించారు.
Immigration Bill: ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!