IND vs AUS: ప్రపంచ కప్కు ముందు టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్పై మరింత ఉత్సాహాన్ని పెంచారు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన వెంటనే ఇరువురు బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పట్టారు.
Read Also: Odisha News: తినే ఆహారంలో చనిపోయిన కప్ప.. చూసి కంగుతున్న విద్యార్థులు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇదిలా ఉంటే.. గిల్ కు ఇది ఆరవ సెంచరీ. 35వ వన్డేలో 35వ ఇన్నింగ్స్లో గిల్ ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో గిల్ 1900 పరుగుల మార్క్ను దాటాడు. వన్డేల్లో 35 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా గిల్ నిలిచాడు. ఈ సెంచరీతో గిల్ ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగుల సంఖ్యను కూడా చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై గిల్కి ఇదే తొలి సెంచరీ. మరోవైపు గతంలో కేఎల్ రాహుల్ ఆసియాకప్లో పాకిస్థాన్పై సెంచరీ సాధించాడు. అదే సమయంలో సూర్యకుమార్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతే కాకుండా విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు మిడిలార్డర్లో ఉన్నారు. అందువల్ల ప్రపంచ కప్ కోసం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనుంది.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ప్రధాన మంత్రి అవుతారు.. జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 16 పరుగుల స్కోరుపై తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య గొప్ప భాగస్వామ్యం ఏర్పడింది. భారత బ్యాట్స్మెన్లిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై సులువుగా పరుగులు సాధించారు. శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మధ్య రెండో వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!