Physical Harassment: ఛీ.. ఛీ.. వీడు టీచరేనా.. విద్యార్థినులతో అలా ప్రవర్తిస్తాడా?
- విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు
- బాలికలతో అసభ్య ప్రవర్తన
- ప్రైవేట్ పార్ట్ చూపించాలని విద్యార్థులను కోరిన టీచర్
- ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. కామాంధుడిగా మారాడు. బాలికలతో దురుసు, అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. హిమాచల్ప్రదేశ్లో బాలికలతో దురుసుగా మాట్లాడిన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. టీచర్పై విద్యార్థినులు చేసిన ఆరోపణలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జోగిందర్నగర్ సబ్ డివిజన్లోని లడ్బాడోల్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు నిందితుడైన ఉపాధ్యాయుడిపై శనివారం ఫిర్యాదు చేశారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్-1098లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బాధిత నలుగురు విద్యార్థినులను పోలీసులు పరామర్శించారు.
Crime News: తాగొచ్చిన భర్తను పొడిచి చంపిన భార్య.. సలసల కాగే నూనె పోసేసింది..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కాగా.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జోగీందర్నగర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో అశ్విని కుమార్ తెలిపారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు పంపింది. సోమవారం మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వచ్చిన విద్యార్థినుల పట్ల కామంతో ప్రవర్తించేవాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ క్రమంలో.. విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్ చూపించమని అడిగేవారని బాధిత విద్యార్థినులు తెలిపారు. అంతే కాకుండా.. వారికి కూడా తన ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేవాడని చెప్పారు. బాధితుల్లో ఇద్దరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఆరో తరగతి విద్యార్థులు ఉన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతికి చైనా ప్రత్యేక పరికరం(అల్ట్రా సెట్)..
ఈ ఘటనపై విచారణలో భాగంగా.. పోలీసులు విద్యార్థినుల కుటుంబ సభ్యులను కలిశారు. జరిగిన విషం గురించి సమాచాం అందించారు. మరోవైపు.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అఖిల భారతీయ జనవాది మహిళా సమితి జోగీందర్నగర్ యూనిట్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని కమిటీ సభ్యులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!