Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సమక్షంలో వైసీపీలోకి చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతో మంది వైఎస్సార్సీపీలో చేరారు. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కొరివి నాగరాజు, గుడారి శ్రీను, వల్లభారపు హనుమంతరావు, మంద ప్రభావతి, మంద ప్రభాస్, మంద నాగేశ్వరరావు, జవ్వాజి పాపయ్య. తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటాను.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాను అనే విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సూచించారు.
Read Also: Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మాత్రమే పథకాలు అందించారు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అలాగే, పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాభిమానం చూస్తుంటే రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అవడం గ్యారంటీ అనిపిస్తోందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. జగనన్న పాలనలో మీ కుటుంబాలకు మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండాలని కోరారు. చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధికి, అందిన సంక్షేమానికి.. జగనన్న పాలనలో జరిగిన మంచికి తేడా చూడాలన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి, దళారీలు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలు మాత్రమే జరిగాయి.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అవే అక్రమాలు, అన్యాయలు రిపీట్ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి పేదల కోసం 125 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రజలు కూడా కేవలం రెండు సార్లు బటన్ నొక్కి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. తమను మరోసారి ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!