Off The Record: జూబ్లీహిల్స్లో టచ్ మీ నాట్ అన్నట్టుగా టీడీపీ, బీజేపీ..
- జూబ్లీహిల్స్లో టచ్ మీ నాట్ అన్నట్టుగా టీడీపీ, బీజేపీ
- బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించని తెలుగుదేశం
- మనసులో ప్రేమల్ని పైకి ప్రకటించుకోకపోవడానికి కారణాలేంటి?
- టీడీపీ ప్రచారం చేస్తే బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని బీజేపీ భయం
- ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతున్న బీఆర్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. కానీ… ఏపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ మాత్రం బీజేపీకి ఇంతవరకు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఎందుకలా? టీడీపీ మద్దతు తెలంగాణలో తమకు చేటు చేస్తుందని కాషాయ దళం భయపడుతోందా? లేక ఇంకేవైనా ఇతర కారణాలున్నాయా? బంధువులిద్దరూ కామన్ ఫంక్షన్లో సంబంధంలేకుండా తిరిగినట్టు ఎందుకు మారింది పరిస్థితి?
Also Read:DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది. కేంద్రంతో ఆ పార్టీకి మంచి సంబంధాలున్నాయి, ఢిల్లీ, అమరావతిలో రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకుంటున్నాయి కూడా. ఆల్ ఈజ్ వెల్. కానీ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతోంది. ఏపీ సంబంధాలతో నిమిత్తం లేకుండా ఇక్కడి వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు సరికదా… ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉంది. ప్రచారం ముగింపు దశకు వచ్చిన టైంలో ఇప్పుడు ఈ సంబంధాల గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది నియోజకవర్గంలో. అయితే రెండు పార్టీలు అలా… మనసులో ప్రేమలున్నా పైకి ప్రకటించకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తెలంగాణాలో టీడీపీ బీజేపీ కోసం ప్రచారం చేస్తే… అది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందన్న అంచనాలున్నాయి. కారు పార్టీ మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ వాదాన్ని తెర మీదికి తీసుకువస్తే… తమకు ఎఫెక్ట్ పడుతుందన్న భయం బీజేపీ వర్గాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. బనకచర్ల సహా… వివిధ ప్రాజెక్ట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా తప్పు పట్టింది బీఆర్ఎస్. ఈ క్రమంలో… చంద్రబాబును బూచిగా చూపించి…బీఆర్ఎస్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నది బీజేపీ భయంగా తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. అదీగాక… ఒక వేళ టీడీపీ లీడర్స్ ఇక్కడ ప్రచారం చేసినా… పెద్దగా కలిసొచ్చి బీభత్సమైన మార్పులేమీ జరిగిపోవన్నది కూడా కాషాయ దళం లెక్క అట.
టీడీపీ ప్రచారం చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ఎవరి వైపు టర్న్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉందని, అందుకే జూబ్లీహిల్స్లో సైకిల్ తొక్కడం కష్టమని భావించి ప్రచారం చెయ్యకుండా సైలెంట్గా ఉంచడమే బెటర్ అని భావించారట బీజేపీ పెద్దలు. అందులోనూ బీజేపీ ఇప్పుడు తెలంగాణలో మరింతగా బలపడాలనే ఆలోచనలో ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీతో కలిసి జూబ్లీహిల్స్లో ముందుకు వెళ్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆలోచన కూడా ఉందట బీజేపీకి.
ఇప్పుడు టీడీపీతో కలిసి ప్రచారం చేస్తే… భవిష్యత్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సొంతంగా ఎదగడానికి ఇబ్బందులు ఉంటాయని, అందుకనే మన ప్రేమల్ని మనలోనే దాచుకుని లోపాయికారీ మద్దతుతో ముందుకు వెళ్లడం బెటర్ అని బీజేపీ నాయకత్వం అనుకున్నట్టు సమాచారం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఉభయకుశలోపరిగా… టీడీపీ పెద్దలు కూడా కామ్గా చేయాల్సిన సాయం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసే రోజు తప్ప… మిగతా ఎక్కడా ప్రచారంలో కూడా టీడీపీ జెండాలు కనిపించలేదు. అయితే… పోలింగ్ రోజున ఏం చేయాలో తమ నేతలకు టీడీపీ పెద్దలు సూచిస్తున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?