Kanakamedala Ravindra Kumar: వారిని ఇంటికి సాగనంపితేనే రైతాంగానికి మంచి రోజులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanakamedala Ravindra Kumar: రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన సీఎం జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలోనిలిపిన జగన్ రెడ్డి, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని విమర్శించారు.
Read Also: Harish Rao: గవర్నర్ పై మాజీ మంత్రి ఆరోపణలు.. మీరే చేశారు..!
Also Read
- Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
- 6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చే శారు రవీంద్రకుమార్.. టీడీపీ ప్రభుత్వంలో 73 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ప్రకృతి విపత్తులు, కరువు వల్ల రాష్ట్ర రైతాంగం రూ.80 వేల కోట్లు నష్టపోయింది. ధాన్యం సేకరణలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో వరిరైతులు 5 ఏళ్లలో రూ. 21 వేల కోట్లు నష్టపోయారు. విద్యుత్ సబ్సిడీ ధర పెంపుతో ఆక్వా రైతులు రూ. 10 వేల కోట్లు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లేక రైతాంగం రూ. 10 వేల కోట్లు నష్టపోయిందని గణాంకాలు వెల్లడించారు. చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీ సీజన్లలో కోటి 42 ఎకరాలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో 2023-24లో రెండు సీజన్లలో కూడా కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగైందన్నారు. టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు యాంత్రీకరణ పరికరాల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఏటా ఒక్కో రైతుకి రూ.12,500లు రైతుభరోసా సాయం ఇస్తానన్న జగన్ రెడ్డి, చివరకు రూ.7,500లు మాత్రమే ఇచ్చి, ఒక్కో రైతుకి 5 ఏళ్లలో రూ.25వేల వరకు ఎగ్గొట్టాడని ఆరోపించారు. చంద్రబాబు రైతు రుణమాఫీ, అన్నదాతా సుఖీభవ కింద ఒక్కోరైతుకి రూ.లక్ష వరకు అర్థిక సహాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం రూ. 37,500లతో సరిపెట్టాడు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.
తాజావార్తలు
-
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
-
Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్లో ‘డార్క్ సీక్రెట్స్’!
-
SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
ట్రెండింగ్
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!