Chandrababu: బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటైతే తప్ప తన రికార్డును బ్రేక్ చేయలేరన్నారు. రెండు రాష్ట్రాలు కలవవు.. తన రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతగా కూడా తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. ఎస్సీలకు న్యాయం చేసేందుకు ఏ,బీ,సీ,డీ వర్గీకరణను టీడీపీ తీసుకొచ్చిందన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణను వైయస్ రాజశేఖర్ రెడ్డి కాపాడ లేకపోయాడన్నారు. దళితులకు ద్రోహం చేసింది… గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని అందరి చెవిలో సీఎం జగన్ పూలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడం మన బ్రాండ్.. పెట్టుబడులు తరిమేయడం జగన్ బ్రాండ్ అంటూ విమర్శించారు.
Read Also: Nallimilli Rama Krishna: టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
వైయస్ వివేకా హత్యపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సీఎం జగన్ అబద్దాలు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. బాబాయిని గొడ్డలి వేటు వేసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైయస్ వివేకా హత్యను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మించి పోయే విధంగా రోజుకొక కథ అల్లుతున్నారన్నారు. బెంగళూరులో ఆస్తికి సంబంధించిన సెటిల్మెంట్ వైయస్ వివేకా హత్యకు కారణం అంటున్నారని.. అంతకు ముందు వైయస్ వివేకా రెండో వివాహం.. ఆస్తికోసం అల్లుడుతో వివాదం హత్యకు కారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని, సీఎం జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను కూడా సీఎం జగన్ బాధితుడినే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!