Drugs Case: డ్రగ్స్ స్మగ్లింగ్కు సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన టాంజానియా దేశానికి చెందిన ఓ యువతికి ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. 2021వ సంవత్సరంలో టాంజానియాకు చెందిన ఓ యువతి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. యువతి వద్ద నుంచి 19 కోట్ల రూపాయల విలువచేసే మూడు కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిను బండారాల రూపంలో డ్రగ్స్ను హైదరాబాద్ తీసుకొచ్చింది ఆ టాంజానియా యువతి. టాంజానియా యువతిని అరెస్టు చేసి డీఆర్ఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
Read Also: Pigeons: పావురం ఈకలు, రెట్టలతో ప్రమాదం.. ముఖ్యంగా చిన్న పిల్లలకు..!