Tammineni Veerabhadram : మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి 20వ పిల్లర్ కుంగుబాటుపై సమగ్ర విచారణ జరిపించాలి. నాణ్యతా లోపాల వల్ల నష్టం, తదితర వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలని, డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటి డిమాండ్ చేస్తున్నదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు 48 పిల్లర్లతో నిర్మాణం చేయడం జరిగింది. ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే రికార్డు స్ధాయిలో నిర్మాణం పూర్తిచేసి దేశంలోనే ప్రతిష్టను స్వంతం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడమే కాకుండా మరో 17లక్షల పాత ఆయకట్టును స్ధిరీకరించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ప్రాజెక్టు పూర్తయిన రెండు సంవత్సరాలకు గోదావరికి వరదలు రావడంతో ఇదేబ్యారేజి లోని 7పంపులు నీట మునిగాయి. వాటి రిపేర్లు, నష్టం ఎవరు భరించాలన్న మీమాంస ముందుకొచ్చింది. ఆ సంఘటన మర్చిపోక ముందే మూడో సంవత్సరం వరదలు తగ్గిన తర్వాత 18 నుండి 21 వరకు గల బ్యారేజి పిల్లర్లు అడుగున్నర లోతు కుంగిపోయాయి. వీటితో పాటు వివిధ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఇపుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి. పగుళ్లు, లీజేకిలు, పెచ్చులూడటం వంటివి కన్పిస్తున్నాయి. నాలుగేళ్ల నుండి 8 ఏళ్లలోపు నిర్మాణం చేసిన ప్రాజెక్టులకు నాణ్యతా లోపాలు వెలుగజూస్తుండటం ఆందోళనకరం.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
బ్యారేజి పూర్తికాగానే తెలంగాణ నుండి మహారాష్ట్రకు బ్యారేజి పై నుండి భారీ వాహనాలు సహా రాకపోకలు సాగించారు. ప్రస్తుతం నిల్పివేశారు. సహజంగా ప్రతి బ్యారేజిపై రవాణాను నిషేధించినా, కాళేశ్వరం నుండి రవాణాను అనుమతించారు. పిల్లర్ ఒకవైపు కుంగిన తర్వాత భయంతో ప్రభుత్వం 10.6 టియంసిల నిల్వ వున్న నీటిని మొత్తం బయటకు పంపించారు. యాసంగిలో ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. మొత్తం నీరు వినియోగంలోకి రాకుండానే నిర్మాణ లోపాలు బహిర్గతమయ్యాయి. ఇంత భారీ స్ధాయిలో బ్యారేజికి నష్టం జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి గానీ, ఇంజనీర్లు వైపు నుండి గానీ వాస్తవాలు బైట పెట్టడం లేదు.మొత్తం ప్రాజెక్టు పూర్తి కాకముందే జరిగిన భారీ నష్టంపై సమగ్రమైన విచారణ జరిపి, వాస్తవాలను తెలియజేయడంతో పాటు నష్టానికి బాధ్యులు ఎవరో ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.’ అని తమ్మినేని వీరభద్రం అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!