Tomatoes: టమాటాలను తక్కువ ధరకు విక్రయించేందుకు తమిళనాడు సర్కారు అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomatoes: దేశంలో టమాటా ధరల పెరుగుదలలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల వంట గదికి టమాటా దూరం అయింది. దేశంలోని పలు నగరాల్లో టమాట కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ధరలను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తమిళనాడు అంతటా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫార్మ్ ఫ్రెష్ అవుట్లెట్లలో (ఎఫ్ఎఫ్ఓ) కిలో రూ. 68 ధరకు టమోటా విక్రయాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ధరలను అదుపు చేసేందుకు వీలుగా 62 ఎఫ్ఎఫ్ఓలు, మూడు మొబైల్ ఫార్మ్ ఫ్రెష్ అవుట్లెట్లలో టమాటా విక్రయాన్ని ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సహకార మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ విజ్ఞప్తి చేశారు.
Also Read: No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్ సర్కారు కొత్త నిబంధన!
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
బహిరంగ మార్కెట్లో కిలో టొమాటో రూ. 90-100 మధ్య అమ్ముడవుతోంది. ఇది మధ్యతరగతి, పేద ప్రజలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎఫ్ఓలలో కిలో టమోటా ధర ప్రస్తుతం కిలో రూ.68గా ఉంది. కీలకమైన కూరగాయలను రూ.60 నుంచి (కిలోకి) విక్రయించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అక్రమార్జనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారని, ధరల పెరుగుదల తాత్కాలికమేనని, ధరల పెరుగుదలను తగ్గిస్తామని చెప్పారు. వేసవి తాపంతో టమాటా సాగు తగ్గి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాక తగ్గడంతో గత వారం నుంచి టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
Also Read: Inflation: ‘టమాటా’ బాటలోనే ‘ఉల్లి’.. ఆర్బీఐ ఏం చేయబోతుంది?
ఇక్కడి కోయంబేడు కూరగాయల మార్కెట్కు సగటున 800 టన్నుల వరకు టమాటా వస్తుండగా, అది ఒక్కసారిగా 300 టన్నులకు తగ్గడంతో బహిరంగ మార్కెట్లో టమాటా ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సలహా మేరకు ధరలను తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.చెన్నైలో మాత్రమే 27ఎఫ్ఎఫ్ఓలు, రెండు మొబైల్ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్ఎఫ్వోలు కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, మధురై, తూత్తుకుడి, తిరునెల్వేలి మరియు తంజావూరుతో సహా ప్రాంతాలలో పనిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!