Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Manipur Government To Soon Bring No Work No Pay Rule For Its Employees

No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!

Published Date :June 28, 2023 , 7:49 am
By Mahesh Jakki
No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manipur: విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించాలని మణిపుర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పరిపాలన శాఖకు ఉత్తర్వులు అందాయి. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆ శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ తెలిపారు. రాష్ట్ర పరిపాలనా శాఖ నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే.. వారి జీతంలో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పరిపాలన శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ వెల్లడించారు. జూన్‌ 12న సీఎం బీరేన్‌ సింగ్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు.

Also Read: Integrated BEd: 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాని, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న హింస కారణంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిబంధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనేది వెల్లడించలేదు.

మణిపూర్ ప్రభుత్వంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది విధులకు హాజరుకాలేదు. అధికారుల ప్రకారం, మణిపూర్‌లో నిరాశ్రయులైన 65,000 మందిలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింస కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. తమ ఉద్యోగులకు “నో వర్క్, నో పే” నిబంధనను తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కుకీ తెగల అత్యున్నత సంస్థ కుకి ఇన్పి మణిపూర్ (KIM) తీవ్రంగా వ్యతిరేకించింది. మణిపూర్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలను, ముఖ్యంగా ఇంఫాల్ లోయ నుంచి పారిపోయిన వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని KIM జనరల్ సెక్రటరీ ఖైఖోహాహు గాంగ్టే అన్నారు.

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రత్యేకంగా అమిత్‌ షాతో భేటీ అయి రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిక సమర్పించారు. మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్‌ షా హామీ ఇచ్చారని భేటీ అనంతరం సీఎం బీరేన్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని మంగళవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • employees
  • Manipur government
  • Manipur Violence
  • No Pay
  • no work

తాజావార్తలు

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions