Taliban – Islamabad: ఇస్లామాబాద్ను నాశనం చేస్తాం: తాలిబాన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban – Islamabad: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇకపై పాకిస్థాన్ నుంచి ఏవైనా దాడులు జరిగితే ఆఫ్ఘనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఆఫ్ఘన్ భూభాగంపై బాంబు దాడి చేస్తే, తాలిబన్లు ఇస్లామాబాద్ను లక్ష్యంగా చేసుకుంటారని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఆఫ్ఘన్ చర్చలకు కట్టుబడి ఉంది. కానీ పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆఫ్ఘన్తో చర్చలకు సహకరించలేదు, చర్చలకు బదులుగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి భద్రతా హామీలను డిమాండ్ చేసింది. ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చలను పాకిస్థాన్ ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆఫ్ఘనిస్థాన్ వర్గాలు ఆరోపించాయి.
READ ALSO: Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు..
ఇటీవల రోజుల్లో సరిహద్దు దాడులు, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. వాస్తవానికి ఇది యుద్ధంలాంటి పరిస్థితికి దారితీసింది. అయితే ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత అక్టోబర్ 19న ఇరుదేశాల మధ్య తాత్కాలికంగా శాంతి నెలకొంది. ఈ చర్చలు విఫలమైతే పాకిస్థాన్ ఆఫ్ఘన్ తాలిబన్లతో పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని దాయాది దేశం రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సైన్యాన్ని హెచ్చరించారు.
ట్రంప్ ఏం చెబుతున్నారంటే..
ఇదిలా ఉండగా ఆదివారం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రయత్నాలు ప్రారంభించాయని తెలుసుకున్నానని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చాలా త్వరగా పరిష్కరిస్తామని తాను హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు.
READ ALSO: Good News to Cotton Farmers: పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!