Taliban – Islamabad: ఇస్లామాబాద్ను నాశనం చేస్తాం: తాలిబాన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban – Islamabad: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇకపై పాకిస్థాన్ నుంచి ఏవైనా దాడులు జరిగితే ఆఫ్ఘనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఆఫ్ఘన్ భూభాగంపై బాంబు దాడి చేస్తే, తాలిబన్లు ఇస్లామాబాద్ను లక్ష్యంగా చేసుకుంటారని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఆఫ్ఘన్ చర్చలకు కట్టుబడి ఉంది. కానీ పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆఫ్ఘన్తో చర్చలకు సహకరించలేదు, చర్చలకు బదులుగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి భద్రతా హామీలను డిమాండ్ చేసింది. ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చలను పాకిస్థాన్ ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆఫ్ఘనిస్థాన్ వర్గాలు ఆరోపించాయి.
READ ALSO: Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు..
ఇటీవల రోజుల్లో సరిహద్దు దాడులు, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. వాస్తవానికి ఇది యుద్ధంలాంటి పరిస్థితికి దారితీసింది. అయితే ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత అక్టోబర్ 19న ఇరుదేశాల మధ్య తాత్కాలికంగా శాంతి నెలకొంది. ఈ చర్చలు విఫలమైతే పాకిస్థాన్ ఆఫ్ఘన్ తాలిబన్లతో పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని దాయాది దేశం రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సైన్యాన్ని హెచ్చరించారు.
ట్రంప్ ఏం చెబుతున్నారంటే..
ఇదిలా ఉండగా ఆదివారం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రయత్నాలు ప్రారంభించాయని తెలుసుకున్నానని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చాలా త్వరగా పరిష్కరిస్తామని తాను హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు.
READ ALSO: Good News to Cotton Farmers: పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!