Talasani Srinivas Yadav : కార్మికులకు ఏ సమస్య వచ్చినా దాసరి అండగా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు దర్శకరత్న దాసరి నారాయణరావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం దాసరి నారాయణరావు 76 వ జయంతి సందర్భంగా చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కళ్యాణ్, డైరెక్టర్ నిమ్మల శంకర్, దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్, దొరై రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన కార్మికులకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ ఒక ధైర్యాన్ని కల్పించారని తెలిపారు. 150 చిత్రాలకు దరహకత్వం వహించి గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారని గుర్తు చేశారు. 53 చిత్రాలకు నిర్మాతగా, 250 కి పైగా చిత్రాలకు కథ, పాటల రచయితగా, నటుడిగా పని చేశారని చెప్పారు. తాతా మనువడు, మేఘ సందేశం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి అనేక గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారని తెలిపారు. బంగారు నంది, నంది, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు ఇలా అనేక అవార్డులను ఆయన అందుకున్నారని పేర్కొన్నారు.
Also Read : Samantha: ఆ విషయంలో సమంత.. అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందా ?
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన భావనను ఇప్పటికీ పరిశ్రమలోని అనేకమంది వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దాసరి నారాయణరావు తో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలోని కార్మికులకు సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో నాటి నటుడు ప్రభాకర్ రెడ్డి తో కలిసి అప్పటి ప్రభుత్వాలపై దాసరి నారాయణరావు ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగానే నేడు చిత్రపురి కాలనీలో వేలాదిమంది కార్మికులకు ఇండ్లు కేటాయించిన విషయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ని ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుందని చెప్పారు. చిత్రపురి కాలనీకి రోడ్డు నిర్మాణం ఎంతో కష్టతరమైన కూడా నిర్మించినట్లు తెలిపారు. ఇవే కాకుండా ఇంకా అనేక సమస్యలు పరిష్కరించి పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి చిత్ర పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వారందరినీప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశ్రమలోని అర్హులైన వారందరికీ అందిస్తామని ప్రకటించారు.
Also Read : Bhatti Vikramarka : ధనిక రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి
తాజావార్తలు
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. బాగా తీసుంటే బాగుండేది కద బుచ్చి..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!