Talasani Srinivas Yadav : రేపు ఉదయం వరకు గణేషుల నిమజ్జనం కొనసాగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జన శోభాయాత్రను మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసు అధికారులు ఉత్సవ్ కమిటీని ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం, ఊరేగింపు ప్రారంభమైంది. 63 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఉదయం 5 గంటలకు ట్రాలీపై ఉంచారు. శోభాయాత్ర కోసం అధునాతన క్రేన్లను వినియోగిస్తున్నారు. 26 టైర్లతో కూడిన ట్రాలీ 55 టన్నుల బరువును మోయగలదు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం రాత్రి గణేష్ దర్శనాన్ని నిలిపివేసి ట్రాలీ వెల్డింగ్ పనులను ప్రారంభించింది. అయితే.. ఉదయాన్నే ప్రారంభమైన మహా గణపతి శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. అయితే.. గణేశుడి నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
Also Read : Asian Games: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసాం.. నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం చేస్తున్నామని, బాలాపూర్ గణనాథుడు మధ్యాహ్నం వరకు చార్మినార్ కు చేరుకునే అవకాశం ఉందన్నారు మంత్రి తలసాని. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని మంత్రి తలసాని వెల్లడించారు. నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వినాయక నిమజ్జనం చూడడానికి లక్షలాదిమంది తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని, వినాయక శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నామన్నారు. గణనాథులను త్వరగా నిమజ్జనం అయ్యేలా చూడడం మా ఉద్దేశం కాదు.. ఎవరు ఎప్పుడు వచ్చినా నిమజ్జనం చేసుకోవచ్చుని.. ప్రజల భద్రతను దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Also Read : CM Jagan : ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!